Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు: మహిళా జైలు సూపరింటెండెంట్

మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్

Webdunia
గురువారం, 13 జులై 2017 (08:42 IST)
మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్ గోరేకు లేఖ రాశారు. దీనిని ఆమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేసి విచారణ జరిపించాలని కోరారు. 
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీనియర్ అధికారి ఒకరు తనతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారని లేఖలో ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గోరేకు తాను ఎటువంటి లేఖ రాయలేదని ఎస్పీ పేర్కొన్నారు. తనకు అందిన లేఖలో సీనియర్లు తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నదీ, సంబంధం కోసం ఎలా ఒత్తిడి తీసుకొస్తున్నదీ వివరంగా ఉందని గోరే చెప్పారు. తాజా తేదీతో రాసిన ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
లేఖలోని నిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించానని, అయితే ఆమె తనకు లేఖ రాసిన విషయాన్ని ఖండించారని పేర్కొన్నారు. దీంతో ఆమెపై ఎవరి ఒత్తిడో పనిచేస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. ఆమె లేఖలో నిజముందని, ఆ విషయం తేల్చేందుకు విచారణ జరిపించాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం